ఒక రాజ్యాన్ని పాలించే మహారాజు ఒక రోజు ఒక మహర్షి దగ్గరికి వెళ్ళాడు. మహర్షి ఎదురుగా భక్తితో చేతులు జోడించి ఇలా వేడుకున్నాడు. " అయ్యా నేను ఒక రాజును.నా దగ్గర సంపద వుంది, సైన్యం వుంది, నన్ను ప్రేమించే బంధుమిత్రులు వున్నారు, నేను శాస్త్రాలు చదివాను, పక్క రాజ్యాల రాజులు నేనంటే భయపడతారు. అయినా నా మనసులో ఎల్లప్పుడు తెలియని ఆందోళన,భయం ఉంటాయి. ప్రతి నిమిషం అధైర్యం నన్ను వెంటాడుతూ ఉంటుంది. దయచేసి నాకు మనశ్శాంతి రావడంలో సాయం చేయండి" అన్నాడు. అప్పుడు మహర్షి ఇలా చెప్పాడు. "మనిషి కష్టాల్ని చూసి చలించిన అమ్మవారు మనిషికి సాయం చేసేందుకు అష్ట లక్ష్మి అంశలను అవతరింప చేసింది. వారే ధనలక్ష్మి, ధాన్య లక్ష్మి, విద్యా లక్ష్మి, విజయలక్ష్మి, సంతాన లక్ష్మి, గజ లక్ష్మి,, ధైర్య లక్ష్మి, ఆది లక్ష్మి. భువి పైకి వచ్చిన లక్ష్మిదేవిలందరు తాము చేయదలచిన పనులను గురించి ప్రస్తావించారు. ధనలక్ష్మి నేను ప్రపంచంలో వుండే ధనాన్ని నియంత్రయిస్తాను అంది, అప్పుడు ధాన్య లక్ష్మి ప్రపంచంలో వున్న ఆహారానికి నియంత్రణ నేను చేపడతాను అంది. విద్యాలక్మి ప్రపంచలోని విద్యను, విజయలక్ష్మి విజయాన్ని, గజ లక్ష్మ...